ఢిల్లీలో భారీ వర్షాల ప్రభావంతో యమునా నది డేంజర్ మార్క్ దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై వరద చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు హత్నికుండ్ బ్యారేజీ వద్ద యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. యమునాలో నీటి మట్టం పెరగడంతో తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరద డ్రోన్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.