హైదరాబాద్ కొండాపూర్లో చిన్నారులను టార్గెట్ చేసిన ముఠాపై స్థానికులు అప్రమత్తమయ్యారు. ఓ కన్స్ట్రక్షన్ సైట్లో వాచ్మన్ పిల్లలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా పట్టుబడ్డారు. ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు ఆటోలో పారిపోగా, ఒక మహిళను పట్టుకుని స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, తల్లిదండ్రులు పిల్లలపై ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.