AP: చిత్తూరు జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వేపమాకులపల్లికి చెందిన గౌరమ్మకు నలుగురు కూతుళ్లు. పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. దాంతో ఆమె కూలీ పనులు చేస్తూ కూతుళ్లను చదివించారు. పెద్ద కూతురు వీణ 2014లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. 2016లో వాణి ఎస్జీటీగా ఎంపికయ్యారు. నెల క్రితం వనజాక్షి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కాగా.. తాజాగా శిరీష ఎస్జీటీ ఉద్యోగం సాధించారు.