హైదరాబాద్లో శుక్రవారం రాచకొండ పోలీసులు మల్కాజిగిరిలో రైలు దిగి వెళ్తున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.1.15 కోట్ల విలువైన 5.1 కిలోల హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన దేబేంద్ర జోడియాగా గుర్తించామని, అతని కోసం గాలిస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు.