తమిళనాడులోని ఈరోడ్ జిల్లా, గోబిచెట్టిపాళయం సమీపంలో ఒక దారుణం జరిగింది. ఓ వివాహిత మహిళ (39) ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రియుడిని సదరు మహిళ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో ప్రియుడు వారిద్దరూ ఎప్పుడూ కలిసే అరటి తోటకు రమ్మని పిలిచి.. రాళ్లతో దాడి చేసి, కత్తితో గొంతు కోసి చంపి.. పొలంలో పూడ్చిపెట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.