బీసీ రిజర్వేషన్లపై రేపే సుప్రీంకోర్టులో విచారణ.. సీఎంతో మంత్రులు కీలక భేటీ

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి భేటీ అయ్యారు.

సంబంధిత పోస్ట్