ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివరాలను తెలపాలని గతంలో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 27న రిజర్వ్ చేసిన తీర్పును జస్టిస్ సచిన్ దత్తా నేడు వెలువరించారు. నీరజ్ అనే వ్యక్తి ప్రధాని మోదీ డిగ్రీ వివరాల కోసం ఆర్టీఐ కింద సీఐసీకి దరఖాస్తు చేయడంతో ఈ వివాదం మొదలైంది.