కర్ణాటకలోని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. దర్శన్ అనే యువకుడు తన బైక్పై వెళ్తుండగా, అనుకోకుండా ఒక కారు సైడ్ మిర్రర్కు తాకింది. దీంతో ఆగ్రహానికి గురైన కారు యజమానులు మనోజ్, ఆర్తి దంపతులు అతడిని కారుతో రెండు కిలోమీటర్ల పాటు వెంబడించి, ఢీకొట్టి చంపారు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.