తమిళ హీరో ధనుష్ హీరోగా, నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కుబేర బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి. కాగా ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది, ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా చిత్ర యూనిట్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది.