శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.2.37 కోట్ల విలువైన బంగారం పట్టివేత

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. కువైట్‌ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా.. 7 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. 1.8 కిలోల బరువున్న ఈ బంగారు కడ్డీల విలువ రూ.2.37 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్