జంట జలాశయాల నుంచి భారీగా నీరు మూసి నదిలోకి చేరడంతో అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తా వద్ద ఆదివారం వర్షపు నీటిలో చేపలు ప్రత్యక్షమయ్యాయి. మూసి బ్రిడ్జిపై నిలిచిన నీటిలో స్థానికులు గానాలతో చేపలు పట్టారు. చాలా రోజుల తర్వాత మూసిలో చేపల వేట సాధ్యమైందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఆదివారం నాడు జరిగింది.