అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మంగళవారం ప్రసంగిస్తూ.. తన పాలనలో అమెరికా కొత్త శకంలో అడుగుపెట్టిందని ప్రకటించారు. ఏడాది క్రితం అమెరికా తీవ్ర ఇబ్బందుల్లో ఉండగా, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని తెలిపారు. ‘‘ఇది అమెరికా స్వర్ణయుగం.. ఏ దేశమూ మాకు సమానంగా లేదు’’ అని వ్యాఖ్యానించారు. కేవలం ఏడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలను తాను ఆపినట్లు పేర్కొన్నారు. వాటిలో భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత కూడా ఒకటని స్పష్టం చేశారు.