హిందూ పంచాంగం ప్రకారం, దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశిని ధంతేరాస్గా జరుపుకుంటారు. ఈ రోజున సంపద దేవత లక్ష్మీదేవి, కుబేరుడిని పూజించడం శుభప్రదమని, ధన యంత్రం, వెండి, ఇత్తడి, రాగి పాత్రలు, లక్ష్మీ-గణేశ విగ్రహాలు, చీపురు, గోమతి చక్రం, కొత్త ఫర్నిచర్, ఇంటి అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఇంట్లో అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం వస్తాయని పండితులు చెబుతున్నారు.