వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత శతకంతో మెరిశాడు. 196 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్లతో 129 పరుగులు సాధించాడు. ఇది అతని కెరీర్లో 10వ సెంచరీ. 177 బంతుల్లో శతకం పూర్తి చేసిన గిల్తో పాటు యశస్వి జైశ్వాల్ (175), సాయి సుదర్శన్ (87), కేఎల్ రాహుల్ (38), నితీశ్ కుమార్ రెడ్డి (43) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ను 518/5 వద్ద డిక్లేర్ చేసింది.