యూఏఈలోని అబుధాబి లాటరీలో ఓ భారతీయుడు జాక్ పాట్ కొట్టాడు. అబుధాబిలో తరచూ ‘బిగ్ టికెట్ అబుధాబి’ పేరుతో లాటరీ తీస్తుంటారు. ఈ మేరకు తాజాగా తీసిన లాటరీలో తమిళనాడుకు చెందిన శరవణన్ వెంకటాచలం రూ.60.42 కోట్లు (25 మిలియన్ దిర్హామ్లు) గెలుచుకున్నారు. అక్టోబర్ 30న ఆయన ‘463221’ నంబర్ టికెట్ కొనుగోలు చేయగా.. నవంబర్ 3న జరిగిన డ్రాలో అతని అదృష్టం వరించింది. శరవణన్ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేరని, మెయిల్లో చేస్తామని నిర్వాహకులు తెలిపారు.