TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు లక్ష్యంగా మంగళవారం గాంధీభవన్లో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటూ, ప్రతి డివిజన్లో సమన్వయంతో పనిచేసి, నవీన్ యాదవ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించడమే తమ సంకల్పమని స్పష్టం చేశారు.