బాన్సువాడ పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు గాను, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాలేఖ్, ఎజాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం జీవో నెంబర్ 9 విడుదల చేసిందని ఆదివారం తెలిపారు. దీనివల్ల స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.