బాన్సువాడలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్, ప్రజల సొమ్ముతో పార్టీ ప్రచారం చేసుకుంటోందని బీజేపీ ఆరోపించింది. రేషన్ బియ్యం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడానికి బ్యాగులు విడుదల చేసి రేషన్ షాపుల్లో అందజేస్తున్నారని, ఇది ప్రజలను మభ్యపెట్టడమేనని బాన్సువాడ బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు గుడుగుట్ల అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని అందరికీ తెలుసునని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల డబ్బు వృధా చేస్తూ తమ పార్టీ ప్రచారం కోసం ఖర్చు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు.