కామారెడ్డి: ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయి స్వాధీనం

కామారెడ్డి మండల శివారులోని పొందూర్తి చౌరస్తాలో పక్కా సమాచారంతో దేవునిపల్లి పోలీసులు తనిఖీలు నిర్వహించగా, మహారాష్ట్ర నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు తరలిస్తున్న 220 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ చింతల్ కు చెందిన కాసమల్ల రాకేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఈ విషయమై పూర్తి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్