అకాల వర్షాలకు తడిసి, మొలకెత్తిన వరిధాన్యాన్ని తేమ, తాలుతో సంబంధం లేకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనాలని బీజేపీ రాష్ట్ర నాయకులు, జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హాజీపూర్ తాండ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులు పండించిన పంట వానకు నేలపాలైందని, తేమ, తాలు పేరుతో కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోయారని అన్నారు. సన్న వడ్లకు బోనస్ కూడా ఇవ్వాలని వారు కోరారు.