బీసీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం కృషి చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో కీలక నియామకం జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ నేత చేతుల మీదుగా శనివారం ఎల్లారెడ్డి మండల బీసీ సంఘం ఇంచార్జిగా జక్కుల సంతోష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చింతల శంకర్ నేత మాట్లాడుతూ, బీసీ వర్గాల అభివృద్ధి కోసం గ్రామ స్థాయి నుండి పోరాడే నాయకులు కావాలని, సంతోష్ లాంటి యువ నాయకులు సంఘాన్ని మరింత బలపరుస్తారని అన్నారు.