కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం తేత్రాయుగ కాలంలో నిర్మితమైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, వివిధ కులాల సంఘ పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, వేణుగోపాల స్వామికి జై కొడుతూ, ఆటపాటలు, పటాకుల సంబరాలతో శోభాయాత్ర చేపట్టారు.