సోమవారం, బీర్పూర్ మండలం మంగేళ గ్రామానికి చెందిన కందుకూరి రాజేశం (45) గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ, మానసిక ఒత్తిడికి గురై, మందులు వాడినా తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు మృతుడి కొడుకు కందుకూరి చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.