వేములవాడ రాజన్న గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఏడవ రోజున శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారితో పాటు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. అమ్మవారిని ప్రత్యేక పుష్పాలతో, ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.