పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అటుగా వెళుతున్న ఎమ్మెల్యే రాగమయి గమనించారు. ఆమె వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించి, బాధితుడిని ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆమె సూచించారు. ఈ సంఘటన ఎమ్మెల్యే మానవతా దృక్పథాన్ని చాటింది.