సత్తుపల్లి: నష్టపోయిన వారికి న్యాయం చేయాలి

సింగరేణి బాంబు బ్లాస్టింగ్ వల్ల నష్టపోయిన పేదలకు నష్టపరిహారం చెల్లించాలని, సత్తుపల్లిలోని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ కార్యవర్గ సభ్యుడు దండు ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ద్వారకాపురి కాలనీ, విరాట్ నగర్, వెంగళరావు నగర్ వాసులతో కలిసి సోమవారం తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కు అందజేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్