తల్లాడ మండలంలోని బాలంపేట నుంచి మల్లావరం గ్రామం వరకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, కంపచెట్లు పెరిగిపోవడంతో వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి, అడ్డంకిగా మారిన మొక్కలను తొలగించాలని ప్రయాణికులు, రైతులు కోరుతున్నారు.