ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన గణపారపు కోటేశ్వరరావు (45) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది ఖమ్మంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం చికిత్స పొందుతూ మృతి చెందిన ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.