లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆదివాసి నాయకుల ఆందోళన

ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని కోరుతూ ఏన్కూరు మండలం ఆదివాసి నాయకులు గంగలూరు నాచారం, రేపల్లెవాడ కాలనీ నాచారం గ్రామాల్లో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. 'వాడెవడు వీడెవడు ఆదివాసికి ఎదురెవ్వడు' అనే నినాదాలతో ఆదివాసులను ఏకం చేశారు. భద్రాచలంలో జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏన్కూరు మండలం ఆదివాసి నాయకుడు వర్షా నాగరాజు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్