కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల నిరవధిక బందుకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8800 కోట్లకు పైగా స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగులో ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని పిడిఎస్యు హెచ్చరించింది.