సుజాతనగర్: పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం సుజాతనగర్ జడ్. పి. హెచ్. ఎస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి, పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, సౌకర్యాలు వంటి అంశాలను సమీక్షించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయుల పాత్ర, వారి కృషి కీలకమని ఆయన అన్నారు. స్వచ్ఛత కాంపైన్ 5. 0 కార్యక్రమం కింద పాఠశాలలో చేపట్టిన శుభ్రతా చర్యల గురించి ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్