మణుగూరు: అభివృద్ధి పనులు పరిశీలించిన నాయకులు

మణుగూరు సమితి సింగారం నుంచి పీవీ కాలనీ వరకు 5 కోట్ల 34 లక్షల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణ పనులను బుధవారం కాంగ్రెస్ నాయకులు నవీన్, శివ సైదులు పరిశీలించారు. ఈ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నిధులు తీసుకువచ్చారని వారు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్