బిహార్లో మద్యాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే మోటులాల్ అనే వ్యక్తి మాత్రం అక్రమంగా మద్యాన్ని కొనుగోలు చేయడానికి తన ఆస్తినే అమ్ముకున్నాడట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘2016లో సీఎం నితీశ్ లిక్కర్ బ్యాన్ చేశారు. అక్రమంగా కొని తాగేందుకు రూ.72లక్షలు ఖర్చు చేశాను. ఇందుకోసం నా కొడుకు భూమి అమ్మేశాడు’ అని వెల్లడించాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.