శ్రీహరికోట నుంచి ఎల్వీఎం3-ఎం5 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ సీఎంఎస్-03 అనే సమాచార ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహం భారతదేశానికి సమాచార సేవలను అందించనుంది. ఇప్పటివరకు భారతదేశం ప్రవేశపెట్టిన ఉపగ్రహాలలో ఇదే అతిపెద్దది.