మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టులో ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని, మత్స్యశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈసారి 82 మిల్లీమీటర్ల సైజులో 2.5 లక్షల చేప పిల్లలను వదిలినట్లు ఆయన తెలిపారు.