గద్వాల: భార్య చావుకు కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు

అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమె మృతికి కారణమైన భర్తకు జోగులాంబ గద్వాల జిల్లా జడ్జి ప్రేమలత సోమవారం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 2, 500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అలంపూర్ మండలం సింగవరానికి చెందిన చాకలి హరికృష్ణకు, కర్నూల్ జిల్లాకు చెందిన జూపల్లి మల్లికకు 2022లో వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం వేధింపులు తట్టుకోలేక మల్లిక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కర్నూల్లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్