నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ లో మంగళవారం దొంగతనం జరిగింది. వంగూరు మండలం పోల్కంపల్లికి చెందిన లక్ష్మణ్ గౌడ్ ఇంట్లో ఈరోజు ఉదయం ఓ దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. గృహప్రవేశం చేసిన రోజు రాత్రే కిటికీ తెరిచి, లోపలికి ప్రవేశించి దేవుని పట్టాల వద్ద ఉన్న బంగారు గొలుసుతో పాటు, ఓ మహిళ మెడలోని 3.5 తులాల గొలుసును ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.