కల్వకుర్తి: విద్యా, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: మంత్రి

నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో ఆదివారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో పది జిల్లాలలో క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, శ్రీహరి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్