విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా దేశంలో తొలి కారును డెలివరీ చేసింది. తెలుపు రంగు టెస్లా ‘మోడల్ వై’ కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ కొనుగోలు చేశారు. ముంబయిలోని ‘టెస్లా ఎక్స్పీరియెన్స్ సెంటర్’లో సంస్థ ప్రతినిధులు ఈ కారు తాళాలను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతాప్ మాట్లాడుతూ దేశంలో తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.