ఎన్నూర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి(వీడియో)

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తిరువళ్లూర్ జిల్లా ఎన్నూర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో నిర్మాణంలో ఉన్న కట్టడం కూలి 9 మంది కార్మికులు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భారీ వలయం నిర్మిస్తున్న క్రమంలో ఇనుప కమ్మీలు కూలి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతులు ఉత్తరాదికి చెందిన కార్మికులుగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్