బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డిలతో మల్లారెడ్డి ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలు తిరుపతిలో వెలిశాయి. దీంతో మల్లారెడ్డి పార్టీ మార్పుపై ఆసక్తి నెలకొంది. మరోవైపు రాజకీయాలకే స్వస్తి పలుకుతానని మల్లారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.