ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో టీచర్ రిషి కుమార్ మద్యం మత్తులో ఫుడ్ డెలివరీ బాయ్కు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించాడు. దురుసుగా ప్రవర్తించడంతో డెలివరీ బాయ్ పోలీసులకు ఫోన్ చేశాడు. అక్కడికి వచ్చిన పోలీసుల పట్ల కూడా రిషి దురుసుగా వ్యవహరించాడు. దీంతో అతడ్ని బలవంతంగా స్టేషన్కు తరలించారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.