మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం మందమర్రి పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం వద్ద సింగరేణి పాఠశాల విద్యార్థులతో కలిసి సుమారు 170 పూల మొక్కలను నాటారు. జీవకోటికి స్వచ్ఛమైన ఆక్సిజన్ చెట్ల నుంచే లభిస్తుందని ఆయన వివరించారు.