తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాష్ట్రంలో జనం బాట యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు పలువురు జాగృతిలో చేరుతున్నారు. తాజాగా బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలకు చెందిన ఉద్యమకారులు, నవీపేట్ మండలానికి చెందిన పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మోపాల్ మండల మాజీ జడ్పీటీసీ, రాంపూర్ సోసైటీ మాజీ వైస్ చైర్మన్ తదితరులు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఆమె వారికి కండువా కప్పి ఆహ్వానించారు.