అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 6.0గా నమోదైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 300కి చేరినట్లు తెలుస్తోంది. మరో 500 మంది గాయపడినట్లు సమాచారం. వేలాది ఇళ్లు నేలకూలాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం దాటికి భూమి కంపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.