రూ.3.5 లక్షలతో మెట్రోకు ప్రయాణికుడు.. నో ఎంట్రీ

TG: హైదరాబాద్ మెట్రోలో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌కు ఓ ప్రయాణికుడు నగదుతో వెళ్లాడు. తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద భద్రత సిబ్బంది రూ.3.5 లక్షల నగదు గుర్తించారు. అయితే రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారం గరిష్ఠంగా రూ.2లక్షల నగదుతో మాత్రమే అనుమతిస్తామని వారు చెప్పడంతో ఆ వ్యక్తి వెనక్కి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్