TG: గద్వాల పరిధి కేంద్ర కమిటీ సభ్యురాలు, మావోయిస్టు పార్టీ ఏకైక మహిళా నేత పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పశ్చిమ బెంగాల్లో 2011లో మృతి చెందిన అగ్రనేత కిషన్జీ భార్య సుజాతక్క, ఛత్తీస్గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెపై 106 కేసులు నమోదు కాగా, రూ.1 కోటి రివార్డు ఉంది. ఆమె లొంగుబాటు వివరాలను డీజీపీ జితేందర్ శనివారం మధ్యాహ్నం మీడియాకు తెలియజేస్తారు.