యూపీలోని బదౌన్ జిల్లా ఖేడా జలాల్పూర్ గ్రామంలో వింత కేసు వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నీలమ్కు 52 ఏళ్ల వయసు.. తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. నీలమ్కు 20 ఏళ్ల కుర్రాడు పప్పు యాదవ్తో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే నీలమ్ తన పదేళ్ల వయసున్న చిన్నకూతురుని తీసుకుని పప్పు యాదవ్తో పారిపోయింది. ఈ ఘటనతో కుటుంబీకులు షాక్ అయ్యారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని నీలమ్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.