నల్గొండలో ఇంటర్ బాలిక (17) హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాక్టర్ డ్రైవర్ గడ్డం కృష్ణ (22)తో బాలికకు పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. ఈ క్రమంలో కృష్ణ స్నేహితుడి సాయంతో బాలికను రూమ్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆందోళన చెందడంతో బాలిక చనిపోయిందని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కాగా తమ కూతురిపై హత్యాచారం బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.