శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర’ చిత్రంలో ధనుష్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా విడుదలకు ముందు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఇప్పటివరకు తాను నటించిన మల్టీస్టారర్ సినిమాలకు భిన్నమైనదని తెలిపారు. ఈ చిత్రంలో సీబీఐ అధికారిగా ఓ సీరియస్ రోల్లో కనిపించనున్నట్టు తెలిపారు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంతో తీర్చిదిద్దిన తన పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందన్నారు.